అంబర్ పేట డివిజన్ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం అమలవుతున్న తీరుతేన్నులను పరిశీలించి, కంటి చికిత్స కొరకు వచ్చిన వారికి అందుతున్న వైద్య సదుపాయాలను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీధర్, ఏవి ప్రవీణ్ కుమార్, వీణ, అనిల్, మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, ఆమనూరి సతీష్,పాక నర్సింగ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట