ఈ నెల 15 నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకు జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్డౌన్ కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం పునఃసమీక్షించింది. హైకోర్టు నిర్ణయానికి న్యాయవాదులు సహకరించాలని ఏజీ ప్రసాద్ కోరారు.