బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది . ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరం వెంబడి కొనసాగుతున్న అల్ప పీడనం రానున్న ఒకటి, రెండు రోజుల్లో పుదుచ్చేరి వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపే అవకాశం వుందని, 11, 12 తేదీల నుంచి వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వర్ష సూచన వున్నదని, తెలంగాణలో అక్కడక్కడా చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.
previous post
next post