రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గoలోని ఆదిభట్ల మున్సిపాలిటీ ప్రాంతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు పేదవాడి కోసం జరిగే ఎన్నికలు అయినందున అందరికి చేతులు జోడించి దండం పెడుతున్నా హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని ఆయన అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే లో ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారని అందువల్ల టిఆర్ యస్ పార్టీకి ఓట్ల రూపంలో బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. గతంలో తాను ఐటి శాఖమంత్రిగా ఉన్నపుడు ఇక్కడ కంపెనీలు తీసుకవచ్చినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చే ఆరు నెలల్లో గ్రామంలో ఉన్న చదువుకున్న వారికి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదని ఆయన అన్నారు.
previous post