కరోనా నియంత్రణకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. 7382928649, 7382929350 ఫోన్ నెంబర్లను దీనికి కేటాయించామని కరోనాకు సంబంధించిన ఏ సమాచారం అయినా ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పవచ్చునని ఆయన తెలిపారు.
ఈ కంట్రోల్ రూం 24 గంటల సేవలు అందిస్తారని ఆయన అన్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, పాజిటీవ్ వచ్చిన వారు ఎక్కడైనా బహిరంగంగా తిరుగుతున్నా, అనుమతి లేకుండా పార్టీలు, ఫంక్షన్లు జరిగినా సమాచారం అందివ్వవచ్చునని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు ఎక్కడైనా భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం అందివ్వాలని ఆయన కోరారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా కరోనా అనుమానితులు వచ్చినా సమాచారం అందివ్వాలని కలెక్టర్ కోరారు.