సింహాచలం ల్యాండ్ స్కాం లపై విజిలెన్స్ ఉచ్చు బిగుస్తున్నది. ఆరోపణలు ఎదుర్కోంటున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యక్షంగా విజిలెన్స్ విచారించనున్నది. సుమారు 860 ఎకరాలు చేతులు మారినట్టు దేవాదాయశాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పంచగ్రామల పరిధిలో ఉన్న ఈ భూములపై త్రిసభ్య కమిటీ వేసిన విషయం తెలిసిందే. అభివృద్ధి పనుల్లో అవకతవకలు, ఉద్యోగుల ప్రమోషన్లు, కాంట్రాక్ట్ విధానంలో నియామకాలపై కూడా విచారణ జరిగింది. విజిలెన్స్ అధికారులు అక్రమాలకు సహకరించిన వ్యక్తులను గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం మొత్తం అక్రమాల విలువ 10వేల కోట్లకు పైమాటే. అప్పటి ఈవో కోడూరి రామచంద్ర మోహన్ కీలకంగా వ్యవహరించారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ, పలువురు తహాశీల్ధార్ల నుంచి వివరాలు సేకరించారు.