28.7 C
Hyderabad
May 6, 2024 02: 58 AM
Slider ఆదిలాబాద్

మెరుగైన సేవలు అందించిన అధికారులకు సన్మానం

#Basara Officers

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం గా  కరోనా కాలంలో మెరుగైన సేవలందించిన ఎస్సై కొదడి రాజు తహసిల్దారు శివ ప్రసాద్, నూతన బాసర మండల మొట్ట మొదటి తహసీల్దారు వెంకట రమణ లను నిర్మల్ జిల్లా బాసర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో సన్మానించారు.

వేద మంత్రోచ్ఛారణ ల మధ్య శాలువాతో సన్మానిoచి వారికి అమ్మవారి చిత్ర పటాన్ని అందించారు. ఒక్క యాచకుడు కూడా ఆకలితో అలమటిoచకుండా రైల్వే స్టేషను వద్ద దాత ల సహకారం తో అన్నదానం నిర్వహించారని వారు ఈ సందర్భంగా తెలిపారు.

అదే విధంగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యాలను కాపాడారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జంగం రాజేందర్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్.సాయినాథ్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేశ్, బిసి సెల్ మండల అధ్యక్షుడు శ్రీను యాదవ్, కె.గంగాధర్ పాల్గొన్నారు.

Related posts

ఒంటిమిట్ట చెరువు నీరు విడుదల… సాయంత్రం నిలుపుదల

Satyam NEWS

అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం ఆరా

Satyam NEWS

ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment