37.7 C
Hyderabad
May 4, 2024 14: 32 PM
Slider నల్గొండ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఇంటింటికీ చేరవేయాలి

#huj

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హతు కార్యక్రమ ప్రారంభ సందర్భంగా ఎ ఐ.సి.సి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత జోడోయాత్ర (పాదయాత్ర) యొక్క లక్ష్యాలను,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఇంటింటికి చేరవేయాలని  ఏర్పాటు చేసిన కరపత్రాలను హుజూర్ నగర్ లోని ఎంపి కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన ముఖ్య నాయకులు కరపత్రాలను విడుదల చేసి కరపత్రాలలోని అంశాల యొక్క ఉద్దేశాలను ఇంటింటికీ చేరవేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,పి.సి.సి సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాములు శివారెడ్డి,పి .సి.సి జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడయాత్ర ఈనెల 30వ,తేదీన కాశ్మీర్ లో ముగుస్తుందని,దానిని కొనసాగింపుగా జోడోయాత్ర లక్ష్యాలను ప్రతి ఇంటికి చేరవేయాలని,హాత్ సే హాతు కార్యక్రమాన్ని ప్రారంభించి,ఈనెల 30వ, తేది నుంచి బూతు లెవెల్ లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త జోడు యాత్ర ఉద్దేశాలను,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి చేరవేస్తారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు ఎడవల్లి వీరబాబు,గొట్టేముక్కుల రాములు,కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్చార్జ్ లు కోళ్లపూడి యోహాన్,లచ్చిమల్ల నాగేశ్వరరావు, ఇట్టిమల్ల బెంజిమెన్,కంకణాల పుల్లయ్య, పోతనబోయిన రామ్మూర్తి,ముషం సత్యనారాయణ,పోతుల జ్ఞానయ్య, జింజిరాల సైదులు,షేక్ ఉద్దండు, చింతకాయల రాము,కస్తాల రవీందర్, కందుకూరి రాము,నూకతొట్టి ప్రమోద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

Satyam NEWS

రమేష్ కుమార్ లేఖను హోంశాఖనే గుర్తించింది

Satyam NEWS

అనవసరంగా బయటకు వస్తున్న  వారిపై కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment