రమేష్కుమార్ లేఖను కేంద్ర హోంశాఖనే గుర్తించిందని సీపీఐ రామకృష్ణ తెలిపారు. రమేష్ కుమార్ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ వాస్తవాలేనని ఆయన చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ఆ లేఖ పై దర్యాప్తు చేయాలని కోరడం కుట్రతో కూడుకున్నదని ఆయన అన్నారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను రమేష్ కుమార్ లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేశారన్నారు. తప్పు తెలుసుకుని జగన్ ప్రభుత్వం సహకరించకుండా దొడ్డి దారిన రమేష్కుమార్ను తొలగించిందని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.