రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజక వర్గం గౌలిదొడ్డి పరిధిలో గత 30 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న 250 మంది వడ్డెర కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దారుణమని మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఈ విషయమై సోమవారం నాడు ఆయన ఒక ప్రకటన చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడడం జరిగిందని వివరించారు. అక్కడ గుడిసెలు వేసుకున్న వారికి వివిధ శాఖకు విద్యుత్ కనెక్షన్, రేషన్ కార్డు తదితర గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నివాసం కోల్పోయిన వారికి న్యాయం చెయ్యకపోతే బాధితుల పక్షాన కాంగ్రేస్ పార్టీ వడ్డెరలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
previous post