తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన నగరానికి చెందిన MLA లు, MLC లతో కలిసి LB స్టేడియంలో ఈ నెల 21 వ తేదీన నిర్వహించే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలు, విందు ఏర్పాట్లను పరిశీలించారు.
ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలలో ముఖ్యమంత్రి, పలువురు క్రైస్తవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారని చెప్పారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంకు సంబంధించి బ్రహ్మాడంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పేద క్రైస్తవులకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్ విందులను నిర్వహిస్తూ వస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను గౌరవిస్తుందని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలలో MLA ల పర్యవేక్షణలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు.
క్రిస్టియన్ సంక్షేమ భవన్ నిర్మాణం, చర్చిలు, గ్రేవ్ యార్డ్ ల అభివృద్ధి పై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట MLC లు M.S.ప్రభాకర్, రాజేశ్వర్ రావు, ఎగ్గే మల్లేషం, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, బేతి సుభాష్ రెడ్డి, GHMC డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, నాంపల్లి నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు.