మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని నిత్యావసర ధరలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాయిరాం నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు పత్తి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ కాప్రా సర్కిల్ అధ్యక్షులు, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష్ సోమశేఖర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోగుల సరిత వెంకటేష్ జిల్లా కార్యదర్శి మెరుగు సునీత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ధరలను వెంటనే తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలపైన భారం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు గడ్డం యాదగిరి, కాప్రా డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడెపు శ్రీనివాసులు, చర్లపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, దళిత విభాగం గ్రేటర్ అధ్యక్షుడు తోటకూర శ్రీకాంత్, నాగ శేషు, నాగరాజు, శివ శంకర్, చందు, రాజు, చెన్నప్ప, వినోద్, ఎల్లయ్య, వెంకటేష్, నాను తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి