సమాజాన్ని పట్టి పీడిస్తున్న పలు సామాజిక రుగ్మతలపై పోలీస్ కళా జాగృతి బృంద సభ్యులు తమ ఆట పాట ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ సత్ఫలితాలు. సాధిస్తున్నారని ఖమ్మం పోలీస్ కమిషనర్ స్వారీ విష్ణు యస్. వారియర్ అన్నారు. బుధవారం ఖమ్మం పోలీస్ కళాబృదం న్యూ ఫ్లెక్సి బ్యానర్ ను పోలీస్ కమిషనర్ అవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన పోలీస్ కళా జాగృతి బృందం యువత చెడు వ్యాసాలకు బానిసలు కాకుండా నిలువరించేలానిర్విరామంగా కళ ప్రదర్శనలు చేస్తూ ప్రజలలో చైతన్యాన్ని నింపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కళ బృందం సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కళబృందం ఇంచార్జీ వెంకటేశ్వరు పాల్గొన్నారు.