37.2 C
Hyderabad
May 6, 2024 14: 41 PM
Slider మహబూబ్ నగర్

విద్యా వాలంటీర్లను సర్వీసులో కొనసాగించాలి

#vidyavoulenteer

విద్యా వాలంటీర్ల సర్వీసులను కొనసాగించాలని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం విద్యా వాలంటీర్లు డిమాండ్ చేశారు. నేడు MRC దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టి వారి డిమాండ్స్ వినతిపత్రాన్ని ఇంచార్జి MEO కి అంద చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని వారు కోరారు.

అదే విధంగా అందరికి పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న తమను విధుల్లో కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  తిరుపతి నాయక్, సురేష్, గోపాల్ నాయక్ రాజు, యశ్వంత్, రాజు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాలువ నిర్మాణంపై కాంగ్రెస్ ఆందోళ‌న‌

Sub Editor

డెల్టాకంటే 4 రేట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి

Sub Editor

డిప్యూటీ కమిషనర్లు బదిలీ

Bhavani

Leave a Comment