29.7 C
Hyderabad
May 6, 2024 04: 47 AM
Slider హైదరాబాద్

డిప్యూటీ కమిషనర్లు బదిలీ

#Deputy Commissioners

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీగా బదిలీలు చేపట్టారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ, పోస్టింగ్ ఇస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.ఇటీవలే జిహెచ్ఎంసికి కొత్త కమిషనర్ గా రోనాల్డ్ రోస్ వచ్చారు. ఆయన పలు అంశాలపై రివ్యూ నిర్వహించి జిహెచ్ఎంసిలో డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు పలువురికి స్థానచలనం కలగగా, మరికొంతమందికి ఇటీవల మున్సిపల్ కమిషనర్ల నుంచి రిలీవైన వారికి పోస్టింగ్లను ఇచ్చారు. కాప్రా డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ బేగంపేట్ సర్కిల్ డీసీగా, బేగంపేట్ డీసీ ముకుంద్ రెడ్డి చందానగర్ డీసీగా, ఉప్పల్ డీసీ అరుణ కుమారి చరణ్ సరూర్ నగర్ డీసీగా బదిలీ, సరూర్ నగర్ డీసీ కృష్ణయ్య కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ గా, హయత్ నగర్ డీసీ మారుతి దివాకర్ అంబర్ పేట్ డీసీగా,

అంబర్ పేట్ డీసీ వేణుగోపాల్ ను తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ, చార్మినార్ డీసీ సూర్యకుమార్ అల్వాల్ డీసీగా, అల్వాల్ డీసీ నాగమణిని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ, రాజేంద్రనగర్ డీసీ జగన్ మెహిదిపట్నం డీసీగా, మెహిది పట్నం డీసీ ఎండీ అలీని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం, కార్వాన్ డీసీ శ్రీనివాస్ కు ఉప్పల్ సర్కిల్ -2 డీసీ తో పాటు కాప్రా డీసీగా,

జూబ్లీహిల్స్ డీసీ రజినికాంత్ రెడ్డి శేరిలింగంపల్లి డీసీ గా, యూసఫ్ గూడ డీసీ రమేష్ మూసాపేట్ డీసీగా, మూసాపేట్ డీసీ రవికుమార్ రాజేంద్రనగర్ డీసీగా, చందానగర్ డీసీ సుధాంశ్ సికింద్రాబాద్ డీసీగా బదిలీ,సికింద్రాబాద్ డీసీ దశరథ్ ఎల్ బీ నగర్ డీసీగా బదిలీ,ఆర్ సీ పురంఅండ్‌పటాన్ చెరు డీసీ బాలయ్య గోషామహల్ డీసీగా బదిలీ, గోషామహల్ డీసీ డాకు నాయక్ చార్మినార్ డీసీగా బదిలీ, కూకట్ పల్లి డీసీ రవీంద్ర కుమార్ హయత్ నగర్ డీసీగా బదిలీ, గాజులరామారం డీసీ ప్రశాంతి జూబ్లీహిల్స్ డీసీగా బదిలీ,

శేరిలింగంపల్లి జాయింట్ కమిషనర్ మల్లయ్య గాజుల రామారం డీసీగా బదిలీ, ఆర్ సీ పురం అండ్‌ పటాన్ చెరు డీసీగా పోచారం మున్సిపాలిటీ కమిషనర్ పని చేసిన సురేష్ కు పోస్టింగ్,సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన చంద్రశేఖర్ కు యూసఫ్ గూడ డీసీగా పోస్టింగ్, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన సత్యబాబుకు కుత్బుల్లాపూర్ డీసీగా పోస్టింగ్, కుత్బుల్లాపూర్ డీసీ మంగతాయారు ను తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశం.

Related posts

దేశానికి కొత్త దిశ చూపిస్తున్న మోడీ ముందు చూపు

Satyam NEWS

కరోనా సమయంలో వారి సేవలు మరువలేనిది

Satyam NEWS

హైదరాబాద్ కు భూగర్భ మెట్రో:ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి

Bhavani

Leave a Comment