సామాజిక విద్యావంతుల న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షులు గా సంద సుధాకర్ ఎన్నికయ్యారు. విద్యావంతులైన ప్రయివేటు స్కూలు, కాలేజీలలో పనిచేస్తూ విద్యా రంగాన్ని నమ్ముకున్న విద్యావంతులు కరోనా కారణం గా ఎన్నో కష్టాలు పడ్డారు. ఉపాధి కరువై దిక్కుతోచని స్థితిలో కొందరు ఉద్యోగాలు దొరకక ఆత్మహత్య లు చేసుకున్న సందర్భాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏర్పాటు అయిన సామాజిక విద్యావంతుల న్యాయ వేదిక నిరుద్యోగులకు నెలకు10వేల రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేసింది. సామాజిక న్యాయ వేదిక చేసే ఈ పోరాటం లో విద్యావంతులు ముందుకు రావాలని, ఈ పోరాటం లో నిరుద్యోగులకు తోడుగ .ముందుండి పోరాటం చేస్తానని సుధాకర్ అన్నారు. తనను ములుగు జిల్లా సామాజిక విద్యావంతుల న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు యేషబోయిన సాంబయ్య యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.