బస్తీ ప్రజల బాధలు తీర్చడంలో భాగంగా హైదరాబాద్ కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్ విస్తృతంగా పర్యటించారు. డివిజన్ లోని మోతి మార్కెట్, నింబోలి అడ్డ, రహ్మత్ బాగ్, చప్పల్ బజార్, కుత్భీగూడ ప్రాంతాలలో చేపట్టవలసిన ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించి జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ లు నరేష్, యాదగిరి లని పిలిపించి చూపించారు. ఈ పనులను త్వరలో పూర్తి చేయాలని పై అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్, సుభాష్ పటేల్, భీమ్ రాజ్, ఆర్.సంతోష్, రవి యాదవ్, సాయి బాబా, నాగ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట