పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు నేడు పర్యటించారు. వాకర్స్ తో కలసి స్టేడియంలో ఆయన కొద్ది సేపు నడిచారు. స్టేడియంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు స్టేడియాన్ని చక్కగా తీర్చిదిద్దారని ఆయన గుర్తు చేశారు.
ఈ స్టేడియంలో కోడెల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి,ఎన్నో రాష్ట్ర,జిల్లా స్థాయి పోటీలు నిర్వహణ జరిగిందని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో స్టేడియం అధ్వాన్నంగా తయారైందని, స్టేడియం చైర్మన్ అయిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్టేడియాన్ని గాలికి వదిలేశారని ఆయన తెలిపారు. దీనికి నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలని డా౹౹చదలవాడ అన్నారు.
నిత్యం ఎంతో మంది స్టేడియంకు వ్యాయమాల కోసం వస్తుంటారు. కానీ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద లేదు. కోడెల స్టేడియాన్ని తక్షణమే అభివృద్ధి చేయాలి. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు శ్రమదానం చేసి స్టేడియాన్ని అభివృద్ధి చేస్తాం. స్టేడియానికి పూర్వ వైభవం తీసుకొస్తాం అని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.