టిఆర్ఎస్ లీగల్ సెల్ ఖమ్మం న్యాయవాదుల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ పలివెల గ్రామంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, రైతుబంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, తదితర పథకాల గురించి ఓటర్లకు వివరిస్తూ ప్రతి గడపగడపకు తిరుగుతూ ఖమ్మం కు చెందిన న్యాయవాదులు విస్తృత ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వివిధ కులవృత్తుల వాళ్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ న్యాయవాదులు సీనియర్ బిచ్చాల తిరుమలరావు, మల్లెబోయిన వలరాజు, మర్రి ప్రకాష్, పిడుతల రామ్మూర్తి, చేకూరి ముక్తేశ్వరరావు, సింగం జనార్ధన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు
previous post