విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శంషాబాద్ లో ఆందోళన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాలు,నర్సింగ్ రావు, సయ్యద్ అక్సర్ తదితరులు పాల్గొన్నారు.