కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు ప్రతినెలా 7 వేల 500 రూపాయల కరోనా సహాయం చెల్లించాలని సీపీయం డిమాండ్ చేసింది.
కడప జిల్లా రాజంపేటలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట నేడు సీపీఎం, సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కార్మిక చట్టాలును సవరించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని వారు వినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు చిట్వేల్ రవి, శంకరమ్మ తదితరులు పాల్గొని తాసిల్దార్ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.