నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పట్టణ వైస్సార్సీపీ కన్వీనర్ షేక్. అబ్దుల్ హనీఫ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ తనకి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి రావటానికి కారణం అయిన నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని రైతులకు అందుబాటులో ఉండి యార్డ్ సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.
previous post