ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పరిరక్షణకు నడుం కట్టిన భారతీయ జనతా పార్టీ ఛలో అంతర్వేది పిలుపునివ్వడంతో బిజెపి నాయకులపై పోలీసుల వత్తిడి విపరీతంగా పెరిగింది.
బిజెపి నాయకులను ఎక్కడిక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. గృహ నిర్భంధంలో ఉంచి పోలీసులను కాపాలాపెడుతున్నారు.
అమలాపురం నుంచి అంతర్వేది వరకూ పాదయాత్ర చేద్దామనుకున్న బిజెపి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకున్నది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మొత్తం పోలీసులు ఆక్రమించారు. అమలాపురం పట్టణంలో పూర్తి కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది.
నిర్మానుష్యంగా మారాయి. అమలాపురం,కోనసీమ వచ్చే రహదారుల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం లోకి ఇతర వ్యక్తులు రాకుండా భారీ గేట్లతో రహదారులు మూసివేశారు.