బెయిల్ పై విడుదల అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. హత్య కేసులో ఆయన అరెస్టు అయిన విషయం తెలిసిందే.
కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన విజయవాడ వెళుతూ మార్గ మధ్యంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.
యాభై మూడు రోజుల తర్వాత ఆయన జైలు నుండి విడుదలయ్యారు.