నేరస్తులను పట్టుకోవడానికి పాత పద్దతులను విడనాడి పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. ముఖ్యంగా నేర స్థలం నుండి వెంటనే వేలి ముద్రలను సేకరించాలని, టవర్ డంప్ ల సహాయముతో డేటాను సేకరించి విశ్లేషించాలని ఆయన అన్నారు.
జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల క్రైమ్ స్టాఫ్, జనరల్ వర్టికల్ అధికారులకు నేడు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర స్థలం నుంచి మరియు సి.సి. పుటేజిలను సేకరించి జిల్లా పొలీసు కార్యాలయములోని సైబర్ ల్యాబ్ లో వీడియో ఎన్హేన్స్ చేయడం ద్వారా నేరస్తులను త్వారగా పట్టుకోవడమే కాకుండా నేరం రుజువు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.సి.యస్. ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఐ.టి. కోర్ టీమ్ ఇంచార్జి యస్.కే. మురాద్ అలీ, అన్ని పోలీస్ స్టేషన్ ల క్రైమ్ స్టాఫ్, జనరల్ వర్టికల్ అధికారులు పాల్గొన్నారు.