జిల్లాలో ఆకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం సర్వే వివరాల నివేదికలో ఉన్న సవరణలను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఖమ్మం ఐడిఓసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా నిర్వహించిన పంట నష్టం సర్వే వివరాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, ఉద్యానవన శాఖ అధికారి అనసూయ, ఏ.డి.ఏలు, ఏ.ఓలు సమావేశంలో పాల్గొన్నారు.