Slider అనంతపురం

ఓ గాడ్: భార్యను హత్య చేసిన సీఆర్ పిఎఫ్ జవాను

murder

ప్రజల ప్రాణాలు కాపాడతానని ప్రమాణం చేసిన సీఆర్ పిఎఫ్ జవాను సొంత భార్యనే హత్య చేసిన దారుణ ఘటన అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల పరిధి తలమర్ల లో జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ సిఆర్ పిఎఫ్ జవాను కురుబ చంద్రమోహన్ (35) ఊటీ లో జవాన్ గా పని చేస్తున్నాడు.  

బుధవారం రాత్రి 8 గంటల సమయం లో తన భార్య  కురుబా చంద్రకళ(25) ను బాత్ రూమ్ లో  గొంతు నులిమి హత్య చేసి  పరారైయ్యాడు. చంద్ర మోహన్, చంద్రకళకు ఇద్దరు కుమార్తెలు  6 నెలలు కుమారుడు ఉన్నాడు. అతను భార్యను నిత్యం వేధిస్తుండేవాడని గ్రామస్థులు తెలిపారు. పారిపోతున్న అతడిని  గ్రామస్థులు పట్టుకొని  పోలీసులకు అప్పజెప్పారు.

ఘటన స్థలానికి  సిఐ బాల సుబ్రమణ్యం, ఎస్ ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి విచారించారు. నిందితుడు  జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు సెలవు తీసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణానికి ఓడిగట్టాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అభివృద్దికి చిరునామాగా కాంగ్రెస్ పాలన

Satyam NEWS

రివర్స్ గేర్:కెనాల్ లో కారు పడి దంపతులు మృతి

Satyam NEWS

మరో మూడేళ్ళ లో గురజాడ వారి “కన్యాశుల్కం”..వస్తుంది..!

Satyam NEWS

Leave a Comment