కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి చిరునామాగా పరిపాలన అందిస్తామని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి అందరిని పలకరించారు. కాంగ్రెస్ మానిఫెస్టోలోని ఆరు గ్యారంటీల గురించి వివరించారు. వృద్ధులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు మేలు జరిగేలా పధకాలు అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అందరికి అన్యాయం జరిగిందని తెలిపారు. గ్రామంలో పలువురు మహిళలు, రైతులు తమకు పధకాలు వర్థించలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధైర్య పడోద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి వెంట భైరు హరినాద్ బాబు, యాదగిరి, మురళి, మెండు వెంకటేష్ యాదవ్, ఖైరు ఉపేందర్, కందుకూరి వెంకటనారాయణ, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, సైదులు, చర్ల సాంబశివరావు, షేక్ జాఫర్, టి. వెంకటేశ్వరరావు, పెరుమాండ్లపల్లి మంగయ్య, తుమ్మల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.