జగనన్న భూహక్కు,రీసర్వే, ప్రయారిటీ భవనాలు, జరుగనున్నకు చెబుదాం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా పధకాల ప్రగతిని కలెక్టర్లతో విస్తృతంగా సమీక్షిస్తున్నారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు అజయ్ కల్లాం, స్పెషల్ సిఎస్ రెవెన్యూ మరియు సిసిఎల్ఏ జి.సాయిప్రసాద్, సియం అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు, అదనపు సిసిఎల్ఏ ఇంతియాజ్, సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.