అంబేద్కర్ వర్ధంతి సభ సీనియర్ జర్నలిస్టుల నేతృత్వంలో ఘనంగా జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ రిపోర్టర్ నరసింహులు ఇంట్లో జరిగిన ఈ వర్ధంతి సభకు.. జర్నలిస్ట్ నాయకులు డాక్టర్ బండి విజయ్ కుమార్.. బస్వరాజ్ హాజరయ్యారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత గానే కాకుండా జర్నలిస్టుగా కూడా బాబా సాహెబ్ దేశానికి అందించిన విశిష్ట సేవల గురించి కొనియాడారు. జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కూడా సంఘటితంగా సాధించుకుందామని ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకుడు బస్వరాజ్ పిలుపునిచ్చారు.
సమస్యలు ఏవైనా.. గౌరవనీయ మంత్రి శ్రీనివాస గౌడ్ నేతృత్వంలో సాధించుకుందామని ఆయన తెలియజేశారు. జర్నలిస్టు మిత్రులంతా ఏకతాటిపైకి వచ్చి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను సాధించుకోవాలి అంటూ డాక్టర్ బండి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సభలో జర్నలిస్టులు వై నర్సింలు.. సుకుమార్.. ఎం వి రమణ.. చంద్రశేఖర్ గౌడ్ జక్కా గోపాల్.. దిలీప్ తదితరులు పాల్గొన్నారు.