27.7 C
Hyderabad
April 30, 2024 07: 28 AM
Slider మహబూబ్ నగర్

ఈ నెల 25న జేపీ నడ్డా బహిరంగ సభను విజయవంతం చేద్దాం

#JP Nadda

ఈనెల 25న ఆదివారం సాయంత్రం 3 గంటలకు నాగర్ కర్నూల్ లో జరిగే భారీ నవ సంకల్ప బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S. రామచంద్రరెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా ఆ సభకు వస్తున్నందున గద్వాల నియోజకవర్గం నుంచి 10 వేల మందికి తగ్గకుండా రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అలంపూర్ నియోజకవర్గంలో నుంచి కూడా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధాని మంత్రిగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశాన్ని అభివృద్ధి పరంగా ఎంతో ముందుకెళ్లిందని మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ భారీ మెజార్టీ లోకసభ స్థానాలతో గెలుస్తారని అన్నారు.

కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా ప్రజలకు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కేంద్రం ఇచ్చే ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవడంలో ఉఫలమైందని అని అన్నారు. ఈసారి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెండు నియోజకవర్గాలలో బిజెపి పార్టీ గెలుస్తుందని అన్నారు.

Related posts

గణనాథుడికి ప్రత్యేక నిత్య పూజలు

Satyam NEWS

టియుడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు సన్మానం

Bhavani

సీఎం జగన్ చేతిలో మోసపోయాం

Satyam NEWS

Leave a Comment