ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హల్ లో జరిగిన సమావేశంలో ములుగు జిల్లా సియస్సి కార్యవర్గాన్ని ఎన్నుకొన్నట్లు ములుగు జిల్లా ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఇ.డి.యం) సామాజి దేవేందర్,CSC డి.యం రేపాల మాధురి తెలిపారు.
ములుగు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఇంజపూరి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ పోలు రాజ్ కుమార్, జనరల్ సెక్రటరీ సంకుర్ధుల భీమయ్య, జాయింట్ సెక్రెటరీ మల్లీశ్వరి, ట్రెజరర్ మార్క రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబరేస్ గా ఆకుల రామకృష్ణ, రాజ్ కిరణ్, చిట్యాల చక్రి, పుల్యాల రజిని లను ఎన్నుకున్నారు.
సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సియస్సి కార్యక్రమాలను చేపడతానని, తనను ఎన్నుకున్న వీ ఆల్ ఈ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమాలైన డిజి పే, ఇఏపీ,టెలి లా,బీసీ పాయింట్స్,ఆధార్,సీ ఎస్ సీ గ్రామీన్ ఈస్టోర్,మీసేవ,ధరణి సర్వీసులపై చర్చించారు.
అనంతరం టెలి లా కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీ షర్ట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో కొమురవేల్లి సతీష్, ప్రశాంత్,రాజేందర్,వినోద్,శంకర్,వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.