సూర్యాపేట జిల్లా చింతపల్లి తండా మండలం పిట్లం తండా కు చెందిన కోటేశ్వరి అజ్మీర అనే 20 ఏళ్ల గిరిజన యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారా యూత్ ప్రెసిడెంట్ భాను పవార్ డిమాండ్ చేశారు.
రోజు రోజుకి అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువైతున్నాయని, ప్రతి ఒక్క అమ్మాయి ఆత్మరక్షణకోసం తైక్వండో కరాటే నేర్చుకోవడం చాలా అవసరమన్నారు.
తల్లిదండ్రులు అమ్మాయిలని కరాటే నేర్చుకోవడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బంజారా అధ్యక్షుడు ప్రకాష్, అరుణ్ నాయక్ ,రాంజీ చందర్ నాయక్, హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.