ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కావాల్సిన ప్రణాళికలు సమర్పించే విషయాలపై ములుగు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.
నూతనంగా ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టాలని, గ్రామ సర్పంచ్, ఎమ్మార్వో సహాయం తీసుకొని సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని వైద్యాధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ రవీందర్ డాక్టర్ శ్యాంసుందర్ డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ సీతారామాంజనేయులు
వైద్యాధికారులు సూపర్వైజర్లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు తిరుపతయ్య భాస్కర్ భూపాల్ రెడ్డి డెమో నవీన్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.