34.7 C
Hyderabad
May 4, 2024 23: 32 PM
Slider మహబూబ్ నగర్

జర్నలిస్ట్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

#journalist

నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎస్పీకి వినతిపత్రం

వనపర్తి జిల్లా బీటివి రిపోర్టర్ అశోక్ కుమార్ రెడ్డి పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇంచార్జి ఎస్పీకి శుక్రవారం వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

వినతి పత్రం అందజేసిన వారిలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నాజా సభ్యులు నాజా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుద్ధారం రవి కుమార్,జిల్లా అధ్యక్షులు మందడి చిరంజీవి,దాదా భాస్కర్,అశోక్ కుమార్ రెడ్డి,దయానంద్,స్వామి,శ్రీను,బాజా శేఖర్,రవికుమార్‌,శంకర్, వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డిప్యూటీ సీఎం  ప‌ర్య‌ట‌న‌లో మీడియా కు కష్టాలు…!

Satyam NEWS

డిసెంబర్ 5న కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాక

Murali Krishna

కరోనా కలకలం: ఖననానికి అడ్డు చెప్పిన గ్రామస్తులు

Satyam NEWS

Leave a Comment