కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత కరోనా పాజిటివ్ వస్తే అనే అంశంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను ఏపి ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళనా చెందవద్దని ప్రభుత్వం ప్రజలకు పూర్తి భరోసా ఇస్తోంది.
కోవాక్సిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తి లేనిది కాదు. ఇందులో SARS Cov2 వైరస్ లేదు
అదే విధంగా కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సినే కానీ శక్తి లేనిది కాదు. ఇందులో కేవలం SARS Cov2 యొక్క జన్యు పదార్ధంలో కొంత భాగం మాత్రమే ఉంటుంది.
ఈ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ RTPCR పాజిటివ్ కు దారితీయవు. వ్యాక్సినేషన్ తరువాత RTPCRలో పాజిటివ్ నిర్ధారణ అయితే, వారిలో కోవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్ధం.
అంతేకానీ వ్యాక్సినేషన్ కారణంగా ఈ పాజిటివ్ వచ్చినట్లు కాదు. కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పారాసిటమాల్ మందు బిళ్లలతో చికిత్స అందించవచ్చు అని ఎ.పి కమాండ్ కంట్రోల్ తెలిపింది.