దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రైతులు అందోళన చేస్తూ 40 రోజులు నుండి రోజుకొకరు చొప్పున 40 మంది మృతి చెందినా బిజెపి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరని, వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు.
ఇతర దేశాల నుంచి,వివిధ పార్టీల నుంచి,వారి పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నా గుడ్డిగా వ్యవహరించడం సరి కాదని అన్నారు. ఇదేమైనా బ్రిటిష్ ప్రభుత్వమా? అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు రైస్ మిల్లులలో పనిచేసే రోజువారి దినసరి కూలీల వేతనాలు పెంచాలని గతంలో నోటీసు ఇచ్చినా స్పందించకపోవడం సరైంది కాదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్లతో కూడుకున్న రెండువ నోటిస్ సోమవారం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు, సింగరికొండ శ్రీనివాస్, రైస్ మిల్ దినసరి కూలి యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు సామల కోటమ్మ, గోపమ్మ, గుండె బోయిన వెంకన్న, చింతకాయల పర్వతాలు, అంజి, రామయ్య, కోటాచారి, సుజాత, గోవిందమ్మ, శారద, బుజ్జి ,వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.