వనపర్తిలో పొగాకు గుట్కాను పట్టుకుని, టివిఎస్ ఎక్స్ఎల్ వాహనం సీజ్ చేశామని టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ విలేకరులకు తెలిపారు.
ప్రభుత్వ నిషేధించబడిన పొగాకు గుట్కాలను నారాయణపేట జిల్లా మరికల్ మండలానికి సంబంధించిన పసుపుల గ్రామానికి చెందిన ఇల్లూరి రఘువీర అనే వ్యక్తి కర్ణాటకలో గల యాదగిరి నుండి నిషేధించబడిన పొగాకు, గుట్కాలను తెచ్చి అమ్ముతున్నాడు.
తన టీవీఎస్ ఎక్స్ ఎల్ పై తన గ్రామం నుంచి వనపర్తి కి తీసుకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వనపర్తి పట్టణ ఎస్ఐ వారి సిబ్బంది భగీరథ విగ్రహం దగ్గర వెహికిల్ చెకింగ్ చేస్తుండగా ఈ లూనాను ఆపారు.
దానిపై ఉన్న మూటలను చెక్ చేయగా అందులో ల SR 152 ప్యాకెట్లు , మీరజ్ 24 ప్యాకెట్లు దొరికాయి. వీటి విలువ అందాజ 9000 రూపాయలు వరకు ఉండవచ్చని తెలిపారు.
నిషేధిత గుట్కాను, టీవీఎస్ ఎక్సెల్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో ఈ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి