ఖమ్మం జిల్లాలో ఈ దారుణం జరిగింది.
ఎర్రుపాలెం మండలం లోని అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నవ్య(22) మూడు రోజులక్రింద మిస్ అయ్యింది.
పెనుబల్లి మండలం లోని కొత్తలంక పల్లి గ్రామం వద్ద శుక్రవారం విగతజీవిగా పడి ఉన్నది.
పెగళ్ళపాడు గ్రామానికి చిన్న నాగశేషి రెడ్డి(27)తో గత డిసెంబర్ 9న ఆమెకు వివాహం జరిగింది.
భర్త నాగశేషిరెడ్డి కి గతంలో ఢిల్లీలో ఓ యువతితో వివాహం జరిగినట్లు సమాచారం.
నవ్య తో వివాహం అంటే ఇష్టం లేని కారణంతో గత మూడు రోజుల క్రితం సత్తుపల్లి సాయి స్ఫూర్తి కళాశాలకు తీసుకువెళ్లి అక్కడే ఉన్న లంకపల్లి కుక్కల గుట్ట వద్ద ఆమెను హతమార్చినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.