మత సామరస్యంలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు టిబెట్కు చెందిన దలైలామా తెలిపారు. శ్రీలంకన్ టిబెటన్ బుద్ధిస్ట్ సొసైటీ వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఇండోనేషియా, మలేసియా, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిల్యాండ్కు చెందిన వందలాది మంది బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ మత సంప్రదాయం అహింసను బోధిస్తుంది. ఇతరులకు హాని కలిగించొద్దని అన్ని మతాలు చెబుతున్నాయి.
భారతదేశ ప్రజలు అహింసా, కరుణ, దయ తదితర వాటిని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. ఇస్లాం, క్రిష్టియానిటీ, జైనులు, యూదులు.. ఇలా ఎన్నో మతాలకు చెందిన వారందరు కలిసిమెలసి ఇక్కడ జీవిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా చైనాపై వరుసగా విమర్శలు చేస్తున్నారు దలైలామా. ముఖ్యంగా అక్కడి నాయకత్వం ఆధిపత్యం చెలాయించడానికే ప్రయత్నిస్తోందన్నారు.