ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆక్రమణకు గురైన దళితుల స్మశాన వాటిక స్థలానికి అధికారులు రక్షణ కల్పించాలని అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కౌన్సిలర్ ముంగమూరు శ్రీను ఎమ్మార్వో ను కోరారు.
10 వ వార్డ్ జగనన్న గృహాల ముందు కోట్లు విలువ చేసే దళితుల స్మశాన వాటికను అధికార పార్టీకి చెందిన నేతలు ఆక్రమించారని విషయం సామాజిక మాధ్యమాలతో పాటు వార్తాపత్రికల ద్వారా వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారు.
దీంతో దళిత సంఘాలు బుధవారం స్మశాన వాటిక వద్దకు చేరుకొని ఆక్రమణదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మశానాలను సైతం దున్నేశారని ఎమ్మార్వో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పట్టించుకోని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.