29.7 C
Hyderabad
April 29, 2024 10: 36 AM
Slider కడప

238 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు

#Free eye surgeries

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అకేపాడులో బుధవారంతో తొమ్మిది రోజుల పాటూ జరిగిన ఉచిత కంటి శస్త్రచికిత్సల వైద్య శిబిరం ముగిసింది. ఉమ్మడి కడపజిల్లా జడ్పీ చైర్మన్ అకేపాటి అమర నాధ రెడ్డి ఆధ్వర్యంలో అకేపాటి ఎస్టేట్ లో మొబైల్ బస్ లల్లో 238 మంది బాధితులకు విజయ వంతంగా చెన్నయ్ శంకర్ నేత్రాలయ వైద్యసిబ్బంది కంటిశస్త్ర చికిత్సలు నిర్వహించారు.

ముగింపు సభలో కడప మేయర్ సురేష్ బాబు,మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి,ఎన్నారై రమేష్ రెడ్డి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజి డైరెక్టర్ చోప్పా ఎల్లారెడ్డి తది తరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి, నిర్వాహకులకు శాలువాలతో సత్కారం చేశారు.

వక్తలు సభలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పూర్తితో జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి పేదలకు ఉచితంగా తొమ్మిది రోజుల పాటూ కంటి శస్త్రచికిత్సలను నిర్వహించడంపై ప్రశంసిస్తూ ప్రసంగించారు.

Related posts

ట్రాజెడీ: కుప్పంలో ఇద్దరి సజీవ దహనం

Satyam NEWS

అక్రమంగా ఆయుధాల స్మగ్లింగ్‌.. కబడ్డీ క్రీడాకారుడు అరెస్ట్‌

Sub Editor

నేటి నుండి శ్రీ సత్య సాయి సూపర్ హాస్పిటల్ లో వైద్య సేవలు బంద్

Satyam NEWS

Leave a Comment