సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలం ఎర్రగట్టు తండ గ్రామంలోని ఎం.పి.పి.స్కూల్ పాత భవనంపై నుండి పెచ్చులు ఊడి స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని స్కూల్ సిబ్బంది ఓజో ఫౌండేషన్ చైర్మెన్ పిల్లుట్ల రఘు దృష్టికి తీసుకుని వెళ్లారు.
తక్షణం ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు స్కూల్ సిబ్బంది చెప్పిన వెంటనే స్పందించి పాఠశాలలో కొన్ని మరమ్మత్తులు చేయించి దగ్గర ఉండి స్కూల్ కి పెయింటింగ్ వేయించారు. స్కూల్ కి పెయింటింగ్ వేయడం చూసి స్కూల్ సిబ్బంది,విద్యార్థులు ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న,పి.యస్ స్కూల్ ఉపాద్యాయులు, గ్రామ ఉపసర్పంచ్ వీరారెడ్డి,నాగేంద్రబాబు, సైదా,సునీల్,టి.సైదా,ఓజో టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్