ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి 30 గేట్లు రెండు అడుగులు 40 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తిన అధికారులు 71,940 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న నీటి మట్టాన్ని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా స్వల్పంగా విడుదల చేస్తున్నారు. వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించి అక్కడ గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు ప్రజలు ఎవరు కృష్ణనది లోనికి వెళ్లకుండా చర్యలను తీసుకోవాలని సూచనలు చేశారు.
previous post