నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారికి మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను ఆయన పరామర్శించారు. కోడెరు మండల పరిధిలోని జనుoపల్లి గ్రామానికి చెందిన ఏనుముల జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందారు.
విషయం తెలుసుకున్న జూపల్లి ఆ గ్రామానికి వెళ్లి వారి భౌతిక కాయనికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. పాన్ గల్ మండల కేంద్రానికి చెందిన పోతుల స్వామి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం మృతి చెందారు.
అదే విధంగా మండల పరిధిలోని వెంగలాయపల్లి గ్రామానికి చెందిన బోయిని పసుల కిష్టన్న అనారోగ్యంతో రాత్రి మృతి చెందారు. ఈ సందర్భంగా ఆ విషయం తెలుసుకున్న జూపల్లి ఆయా గ్రామాల్లోని వారి భౌతిక కాయలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారితోపాటు ఆయా మండల గ్రామాల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి యువసేన నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.