ఉప్పల్ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ మైదానంలో విజయదశమి పండుగ పురస్కరించుకుని శనివారం భారీగా ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలు దసరా ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి.
కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,కార్పొరేటర్లు మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి, బండారు శ్రీవాణి ,కొప్పుల నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొనీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావణ దహనం, శమీ పూజ,పాలపిట్ట దర్శనం, తదితర కార్యక్రమాలు అతిథుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య సలహాదారుడు పాశికంటి నాగరాజు, విశిష్ట అతిథులుగా పుర ప్రముఖులు దుబ్బ నరసింహారెడ్డి రెడ్డి, కందికంటి అశోక్ గౌడ్, సల్ల రాజిరెడ్డి, బోరంపేట కృష్ణ, బజార్ జగన్నాథ్ గౌడ్, ఏసూరి యాదగిరి, తెల్కల మోహన్ రెడ్డి, బాకారం లక్ష్మణ్, బజారు మురళి, గుమిడెల్లి నారాయణ, బజార్ పాండుగౌడ్, రఘుపతి రెడ్డి, బిక్కుమళ్ల అంజయ్య గుప్తా, తొఫిక్, ఈగ అంజయ్య, కురుమసంఘం అధ్యక్షులు గోరిగ ఐలయ్య, లూకాస్, సుధాకర్, అలీం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.