ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనలకు బాధ్యుడుగా భావిస్తున్న దీప్ సిద్ ను ఎన్ఐఏ ప్రశ్నించబోతున్నది.
ఎర్రకోట వైపునకు రైతులను మళ్లించడం, అక్కడ విధ్వంసం సృష్టించడం, జాతీయ పతాకం ఎగరవేసే స్థానంలో ఒక మతానికి సంబంధించిన పతాకాన్ని ఎగరవేయడం లాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.
రైతులు 58 రోజులుగా చేస్తున్న ఆందోళన నుంచి ఇప్పటికే రెండు యూనియన్లు తప్పుకున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నాయి.
జనవరి 30న దేశ వ్యప్తంగా రైతులు ఎక్కడిక్కడ నిరాహార దీక్షలు చేస్తారని రైతు సంఘాలు ప్రకటించాయి.