అమెరికా నూతన రక్షణ శాఖ కార్యదర్శి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.
వివిధ అంశాలపై భారత్ అమెరికాలు కలిసి చేయాల్సిన కార్యక్రమాలపై వారు మాట్లాడుకున్నారు.
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జోబైడెన్ మిత్ర దేశాల నేతలను తరచూ పలుకరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే భారత రక్షణ శాఖ మంత్రితో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయడ్ ఆస్టిన్ మాట్లాడారు.
భారత్ అమెరికాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆస్టిన్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చెప్పారు.