ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం పంచాయతీ కొత్తపల్లి గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక ఎం ఎల్ ఏ కోటారు అబ్బయ్యచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. గ్రామం లో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలైన ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, జగనన్న చేయూత, వై ఎస్ ఆర్ ఆసరా, జగనన్న అందించే పింఛన్ లు, గృహాల మంజూరు, అమ్మవడి, రైతు భరోసా వంటి పథకాలు ప్రతి లబ్ది దారునికి అందిస్తున్నట్టు వివరించారు. ఇంటింటికి వెళ్లి వారి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న వారి సమస్యలు, అనారోగ్యంతో ఉన్నవారిని స్వయంగా కలిసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామప్రజల ఆదరాభిమానాలు, ప్రజా ప్రతినిధులు, వై సి పి కార్యకర్తలు, నాయకులు వెంటరాగా అబ్బయ్య చౌదరి తల్లి బాగున్నారా, అన్నా బాగున్నారా, జగనన్న ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా అంటూ ప్రజలతో మమేకమై ప్రతి వీధి తిరిగారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లారు. ప్రజల మధ్యలో సమయం తెలియకుండా గ్రామస్తుల సమస్యలు విన్నారు. వారినుండి వచ్చిన వినతులందుకున్నారు.
previous post