28.7 C
Hyderabad
May 5, 2024 23: 24 PM
Slider హైదరాబాద్

ఇచ్చిన హామీలను పూర్తి చేస్తూ..ప్రగతి దిశగా ముందుకు..

#MLAKPVivekananda

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేస్తూ ప్రగతి దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో రూ.37 లక్షలతో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి శంఖుస్థాపన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రణాళిక బద్ధంగా సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్నామన్నారు.

మంచి నీటి సరఫరా, రోడ్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మధు మోహన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చౌడ శ్రీనివాస్ రావు, నాగిళ్ల శ్రీనివాస్, మన్నె రాజు, ఆమిర్ ఖాన్, ఫెరోజ్ వార్డు సభ్యులు సిద్దిక్, అరుణ, శెహనాజ్ బేగం, శేఖర్ గౌడ్, జానకి రామ్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవంబర్ 3న పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయండి

Satyam NEWS

అక్కడ ఏడున్నరైనా కనిపించని సూర్యుడు…!

Satyam NEWS

శౌర్య దివస్: సర్దార్ పటేల్ కల నెరవేరుస్తాం

Bhavani

Leave a Comment